ఆర్ కాంగ్రెస్ పాయె, ఐ కాంగ్రెస్ పాయె, త్వరలో వై కాంగ్రెస్ కూడా!!
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నేడు మీడియాలో మాట్లాడుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాచమల్లు వాడో బచ్చా వాళ్లేంది నాకు బిక్ష పెట్టేది దమ్ముంటే చర్చకు రావాలి. ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తా,” అని సవాల్ విసిరారు. బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనను విమర్శలు చేశారు.దేశంలో మొదటి స్థానంలో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ను జగన్ పూర్తిగా భ్రష్టు పట్టించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి వైపు ఆయన దృష్టి లేదు. ఆయన పట్టించుకోకపోతే మేమే అభివృద్ధి చేస్తున్నాం, అని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆయన రాజకీయ చరిత్రను ప్రస్తావన చేస్తూ1996లో వైఎస్ కుటుంబం ఓటమి భయంతో నా మద్దతు కోరింది. ఆర్ కాంగ్రెస్ పోయింది, ఐ కాంగ్రెస్ పోయింది, త్వరలో వై కాంగ్రెస్ కూడా పోతుంది,అని పేర్కొన్నారు.
అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి.. పాడె మోసి నివాళి!!
ప్రసిద్ధ కవి, రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు ఘట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లాలాపేట్ నుంచి ఘట్కేసర్ వరకు సాగిన అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆగిపోయిన ప్రచారాలు..మూగబోయిన మైకులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి అవకాశం ఉండగా..దాదాపు 45రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ప్రచారానికి తెర పడింది.అన్ని పార్టీల నేతలందరూ చివరి నిమిషం వరకూ సర్వశక్తులను ఒడ్డి ప్రచారం చేశారు.
భర్త మహాశయులకు మీ రవితేజ విజ్ఞప్తి ఏమనగా?
మాస్ మహారాజ రవితేజరవితేజ 76వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను రేపు విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆశికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ సినిమా మళ్లీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటాను.. రష్మిక మందన్న..
విజయ్ దేవరకొండ ,రశ్మిక అంగేజ్ మెంట్ ,పెళ్లి వార్తలు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా! ఈ నేపథ్యంలో తన గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు రశ్మిక. ఈ చిట్ చాట్ లో ఆమె అభిమానులందరు కూడా కూర్చున్నారు. అందులో ఒక అభిమాని అడిగాడు. మీ కాబోయే భర్త ఎలా ఉండాలి అనుకుంటున్నారు అని. దానికి సమాధానంగా రశ్మిక ఏం చెప్పారంటే తన కోసం యుద్ధం చేయగలిగే వ్యక్తి ఉండాలి. తనని లోతుగా అర్థం చేసుకొని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎలాంటి సిచువేషన్ అయినా సరే తన కోణం నుంచి ఆలోచించి తన పక్కన తనకి అండగా నిలబడాలి. అలాంటి వ్యక్తి కోసం తూటాకైనా ఎదురు నిలబడతానన్నారు రశ్మిక.
"ఎవరినీ వదిలిపెట్టేది లేదు" - అనంతపురం సాక్షిగా లోకేష్ శపథం!!
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో కార్యకర్తల్లో జోష్ నింపారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ, వారిని నేరుగా కలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. అలాగే ప్రభుత్వం తరఫున భక్త కనకదాసు జయంతి కార్యక్రమంలో పాల్గొని కురుబలతో దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.
అభిమానాన్ని అమ్ముకోవడమేనా? సేలెబ్రిటీ అంటే?
సెలబ్రిటీలంటే ఎవరు? సినిమా నటులా? ఇన్ఫ్లుయెన్సర్సా? కోట్ల మంది అభిమానులు ఉన్న క్రికెటర్లా? ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళంతా సెలబ్రిటీలైపొతారా? లేదంటే బాధ్యతగా మసలుకుంటూ పది మందికి ఆదర్శంగా ఉండే వాళ్ళు సెలబ్రిటీలనిపించుకుంటారా? హైదరాబాద్ సిపి పోస్తోనే సెలబ్రిటీలంటే ఎవరనే చర్చ మొదలైంది. ఇంతకీ అసలు సిసలు సెలబ్రిటీలు ఎవరు?
కమ్మ..కమ్మ..కమ్మనైన ఓటు దారెటు!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. మూడు ప్రధాన పార్టీలు — కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
Peddi: చికిరి చికిరి వీడియో సాంగ్ రిలీజ్ : హుక్ స్టెప్పులతో అదరగొట్టేసిన రామ్చరణ్
మెగా పవర్స్టార్ రామ్చరణ్ (Ram Charan ), జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా నుంచి తొలి సింగిల్ ‘చికిరి చికిరి’ విడుదలైంది. ఈ పాటలో రామ్చరణ్ డ్యాన్స్ స్టెప్స్, ఎనర్జీ ప్రేక్షకులను ముగ్ధులను చేస్తున్నాయి. జాన్వీ కపూర్ (Jahnavi Kapoor) తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్తో పాటకు అదనపు అందాన్ని చేకూర్చింది. జానీ మాస్టర్ (
కార్తికమాసంలో నదీస్నానానికి ఉన్న ప్రాముఖ్యత ఇదే..!
కార్తీక మాసంలో నదీ స్నానానికి ప్రాముఖ్యత ఉంటుంది. నదీ స్నానం చేయడం వలన శరీరంతో పాటుగా మనసు కూడా శుద్ధి అవుతుంది. పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసంలో పవిత్ర నదులైన గంగ, గోదావరి , కృష్ణా వంటి నదుల్లో స్నానం చేయడం వలన గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని చెబుతారు. కార్తీక మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని ఈ మాసంలో చేసే ప్రతి మంచి పనికి తప్పకుండా అపారమైన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదుల్లో కొలువై ఉంటారని అందుకే కార్తీక స్నానం ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని కూడా పెంచుతుంది.
Videos view all
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!
వాగులో డ్రైవర్ తో సహా కొట్టుకుపోయిన లారీ..! | Heavy Flood Water Inflow In khammam | Montha Toofan