ఆర్ కాంగ్రెస్ పాయె, ఐ కాంగ్రెస్ పాయె, త్వరలో వై కాంగ్రెస్ కూడా!!
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నేడు మీడియాలో మాట్లాడుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాచమల్లు వాడో బచ్చా వాళ్లేంది నాకు బిక్ష పెట్టేది దమ్ముంటే చర్చకు రావాలి. ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తా,” అని సవాల్ విసిరారు. బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనను విమర్శలు చేశారు.దేశంలో మొదటి స్థానంలో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ను జగన్ పూర్తిగా భ్రష్టు పట్టించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి వైపు ఆయన దృష్టి లేదు. ఆయన పట్టించుకోకపోతే మేమే అభివృద్ధి చేస్తున్నాం, అని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆయన రాజకీయ చరిత్రను ప్రస్తావన చేస్తూ1996లో వైఎస్ కుటుంబం ఓటమి భయంతో నా మద్దతు కోరింది. ఆర్ కాంగ్రెస్ పోయింది, ఐ కాంగ్రెస్ పోయింది, త్వరలో వై కాంగ్రెస్ కూడా పోతుంది,అని పేర్కొన్నారు.
అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి.. పాడె మోసి నివాళి!!
ప్రసిద్ధ కవి, రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు ఘట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లాలాపేట్ నుంచి ఘట్కేసర్ వరకు సాగిన అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆగిపోయిన ప్రచారాలు..మూగబోయిన మైకులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి అవకాశం ఉండగా..దాదాపు 45రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ప్రచారానికి తెర పడింది.అన్ని పార్టీల నేతలందరూ చివరి నిమిషం వరకూ సర్వశక్తులను ఒడ్డి ప్రచారం చేశారు.
"ఎవరినీ వదిలిపెట్టేది లేదు" - అనంతపురం సాక్షిగా లోకేష్ శపథం!!
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో కార్యకర్తల్లో జోష్ నింపారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ, వారిని నేరుగా కలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. అలాగే ప్రభుత్వం తరఫున భక్త కనకదాసు జయంతి కార్యక్రమంలో పాల్గొని కురుబలతో దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.
అభిమానాన్ని అమ్ముకోవడమేనా? సేలెబ్రిటీ అంటే?
సెలబ్రిటీలంటే ఎవరు? సినిమా నటులా? ఇన్ఫ్లుయెన్సర్సా? కోట్ల మంది అభిమానులు ఉన్న క్రికెటర్లా? ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళంతా సెలబ్రిటీలైపొతారా? లేదంటే బాధ్యతగా మసలుకుంటూ పది మందికి ఆదర్శంగా ఉండే వాళ్ళు సెలబ్రిటీలనిపించుకుంటారా? హైదరాబాద్ సిపి పోస్తోనే సెలబ్రిటీలంటే ఎవరనే చర్చ మొదలైంది. ఇంతకీ అసలు సిసలు సెలబ్రిటీలు ఎవరు?
కమ్మ..కమ్మ..కమ్మనైన ఓటు దారెటు!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. మూడు ప్రధాన పార్టీలు — కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
వాట్ యాన్ ఐడియా సర్ జీ : సీఎంని మించిపోయిన డిప్యూటీ సీఎం!!
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్( Pawan Kalyan) పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలతో పాటు అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిసిందే. స్వతహాగా పర్యావరణ ప్రియుడు అయిన పవన్, అడవుల సంరక్షణకు వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తున్నారు. అదే సమయంలో, అడవి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రత, సంక్షేమం ఆయనకు ముఖ్యమని చెప్పవచ్చు. ముఖ్యంగా చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో గజరాజుల సమస్య కొన్ని సంవత్సరాలుగా ప్రజలను వేధిస్తోంది. సమీప అడవుల నుంచి గ్రామాల్లోకి వచ్చే ఏనుగులు ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే కాక, వందల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తుంటాయి.
విడదల రజిని కాదు వివాదాల రజని!! పార్టీకి తలనొప్పిగా మారిందా?
ఆమె మాజీ మంత్రి. అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలతో విబేధాలు ఎదుర్కొన్న ఆమె, అధికారం కోల్పోయిన తరువాత అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారింది. వరుసగా వివాదాల్లో ఆమె పేరు వినిపించడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.. తాజాగా పల్నాడు జిల్లాలో ఆమెతోపాటు ఆమె అనుచరులపై వచ్చిన ఆరోపణలతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
Videos view all
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!
వాగులో డ్రైవర్ తో సహా కొట్టుకుపోయిన లారీ..! | Heavy Flood Water Inflow In khammam | Montha Toofan
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ & టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్